హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ఉధృతి అధికమవుతున్నందున విద్యార్థుల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా ఉస్మానియా యూనివర్సి టీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే సెకండియర్కు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది.
యూనివర్సిటీ పరిధిలో బీసీఏ, బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీకామ్ కోర్సులు చదివే విద్యార్థులందరినీ ప్రమోట్ చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
సెకండియర్, ఫైనలియర్ పరీక్షలపై పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి