యాదాద్రి, మే 3 : రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఆహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలని స్వామివారిని అర్ధించినట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సోమవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు స్వామివారి ఆశీర్వచనం, ప్రసాదం అం దజేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మా ట్లాడుతూ.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు సీఎం కేసీఆర్ వెంట ఉన్నారని ఓటు ద్వారా చెప్పారన్నారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు కేసీఆర్కు మరింత శక్తినివ్వాలని యాదాద్రీశుడిని వేడుకున్నట్లు తెలిపారు.
‘సాగర్’లో బీజేపీ నిమజ్జనం:పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
బీజేపీని ప్రజలు నాగార్జునసాగర్లో నిమజ్జనం చేశారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేవని, ఉన్న ది ఏకైక పార్టీ టీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. సోమవారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ దుబ్బాకలో పుట్టి, హైదరాబాద్లో పెరిగి, నాగార్జున సాగర్లో కొట్టుకుపోయిందన్నారు. కరోనా మహమ్మారి బారినపడిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్కుమార్ త్వరగా కొలుకోవాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. మంత్రుల వెంట ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనర్సింహాచార్యులు, ఏఈవో దోర్బాల భాస్కర్శర్మ, రమేశ్బాబు, శ్రవణ్కుమార్, ఆలయ అర్చకులు, టీఆర్ఎస్ నాయకుడు కాంటేకార్ పవన్కుమార్ పాల్గొన్నారు.