హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్)పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ర్టంలో ఉద్యోగులకు, వారి కుటుంబాల సభ్యులకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అని మంత్రి తెలిపారు. దీని కింద రూ. 350 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుందన్నారు. ఈ స్కీం కింద ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు కలిపి.. మొత్తం 12 లక్షల 4 వేల 654 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఓపీ, ఐపీ కేసుల సంఖ్య పెరుగుతుంది. వెల్నెస్ సెంటర్ల ద్వారా ఉద్యోగులు, జర్నలిస్టులు, రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య సదుపాయాలు అందుతున్నాయని తెలిపారు. బకాయిల విషయంలో ప్రభుత్వం ప్రతి క్వార్టర్కు ఒకసారి చెల్లింపులు జరుగుతున్నాయి. ఈహెచ్ఎస్ కింద రూ. 37 కోట్లు ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు చెల్లించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.