ఉత్సవమూర్తులకు నిజాభిషేకం
కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు
వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రత పూజలు
శ్రీవారి ఖజానాకు రూ. 10,21,714 ఆదాయం
యాదాద్రి, ఆగస్టు1: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో ఆదివారం అర్చకులు ఉత్సవమూర్తులకు నిజా భిషేకాన్ని అత్యంత వైభవంగా జరిపారు. ఆర్జిత పూజల కోలా హలం తెల్లవారుజాము మూడుగంటల నుంచే మొదలైంది. అభిషేకాలతో స్వామివారి నిత్యారాధనలు ప్రారంభించారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకు లు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హా రతి నివేదనలు అర్పించారు. సుదర్శన హోమం ద్వారా శ్రీవారి ని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపా రు.ప్రతిరోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు పా ల్గొని స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు. దేవేరులను ముస్తా బు చేసి గజవాహనంపై ముఖమండపంలోనే ఊరేగించారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండ పంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి సుమారు గంటన్నర కు పైగా కల్యాణతంతు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్త ర పూజలు జరిపారు.రూ.100 టికెట్పై బాలాలయ ముఖమం డపంలో 10 నిమిషాల పాటు జరిగే పూజలకు ఆదరణ పెరు గుతున్నది. పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభి షేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మ వారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ఆదివారం బోనాల ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది.
ఖజానాకు రూ. 10,21,714 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.10,21,714 ఆదాయం వచ్చినట్లు ఆ లయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,65,33 4, రూ.100 దర్శనంతో రూ.15,700, వీఐపీ దర్శనాలతో రూ.90,000, సుప్రభాతం ద్వారా రూ.600, క్యారీ బ్యాగు లతో రూ. 2,000, సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ. 14,500, కల్యాణ కట్టతో రూ. 16,000, ప్రసాద విక్ర యంతో రూ. 4,15,925, శాశ్వతపూజల ద్వారా రూ. 27,3 48, వాహన పూజలతో రూ. 13,300, టోల్గేట్తో రూ. 1,5 70, అన్నదాన విరాళంతో 15,640, సువర్ణ పుష్పార్చన ద్వా రా రూ. 1,15,360, యాదరుషి నిలయంతో రూ. 48,800, పాతగుట్టతో రూ.9,125, టెంకాయల విక్రయాలతో రూ. 60, 000, ఇతర విభాగాలతో రూ. 10,512తో కలుపుకొని రూ. 10,21,714 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.