నల్లబెల్లి, మార్చి 1: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న పిలుపునిచ్చారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని మహిళలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. మూడో రోజు బుధవారం జరిగిన పోటీల్లో కబడ్డీలో బుచ్చిరెడ్డిపల్లె మహిళలు ప్రథమ స్థానం సాధించారు. మూడుచెక్కలపల్లె ద్వితీయ స్థానం పొందింది. ఖోఖోలో మూడుచెక్కలపల్లెలోని మహిళలు ప్రథమ స్థానం, రాంపూర్ మహిళలు ద్వితీయ స్థానంలో నిలిచారు. గెలుపొందిన వారికి ఈ నెల 8న ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీత, మాజీ ఎంపీపీ బానోత్ సారంగపాణి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ప్రవీణ్గౌడ్, మండల సమాఖ్య అధ్యక్షురాలు ఊటుకూరి భాగ్యలక్ష్మి, ఏపీఎం సునీత, నాయకులు గందె శ్రీనివాస్గుప్తా, దామ సాంబయ్య, పద్మ పాల్గొన్నారు.
నెక్కొండ: మండలకేంద్రంలో క్రీడా పోటీలను జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న పరిశీలించారు. ఈ సందర్భంగా టాస్ వేసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. మండలస్థాయిలో ఎంపికైన జట్లతో నర్సంపేటలో డివిజన్స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు స్వప్న తెలిపారు. కార్యక్రమంలో నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, మండల సమాఖ్య అధ్యక్షురాలు మార్త లావణ్య, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, దీక్షకుంట సర్పంచ్ ఆలకుంట సురేందర్ పాల్గొన్నారు.
ఖానాపురం: మండలంలోని బుధరావుపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న మండలస్థాయి మహిళా క్రీడోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. బుధవారం కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, ఖోఖో, రన్నింగ్ పోటీలు నిర్వహించారు. టగ్ ఆఫ్ వార్లో అశోక్నగర్కు ప్రథమ స్థానం, ఖానాపురం ద్వితీయ స్థానంలో నిలిచాయి. రన్నింగ్లో ఖానాపురం గ్రామానికి చెందిన బండి గాయని మొదటిస్థానం, బుధరావుపేటకు చెందిన కుందెనపల్లి దీప్తి రెండో స్థానంలో నిలిచినట్లు ఏపీఎం సుధాకర్ తెలిపారు.
నర్సంపేటరూరల్: పాతముగ్దుంపురం గ్రామ జాగృతి విద్యానికేతన్ హైస్కూల్లో చెన్నారావుపేట మండలస్థాయి మహిళా క్రీడా పోటీలు మూడో రోజూ ఉత్సాహంగా కొనసాగాయి. కబడ్డీ, ఖోఖో, టగ్ ఆఫ్ వార్, రంగోళీ, రన్నింగ్ పోటీలు నిర్వహించారు. మండలస్థాయిలో ఫైనల్కు చేరిన జట్టను నర్సంపేటలో జరుగనున్న డివిజన్స్థాయి క్రీడోత్సవాలకు ఎంపిక చేయనున్నారు. చెన్నారావుపేట వైస్ ఎంపీపీ, బీఆర్ఎస్ మండల ఇన్చార్జి కంది కృష్ణారెడ్డి, పాతముగ్దుంపురం, చెన్నారావుపేట సర్పంచ్లు సుంకరి లావణ్య, కుండె మల్లయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, మాజీ జడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, ఐకేపీ ఏపీఎం ఈశ్వర్ ఆధ్వర్యంలో పోటీలు కొనసాగుతున్నాయి.