వరంగల్ : జిల్లాలోని నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గ్రామంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి జిల్లా కలెక్టర్ గోపితో కలిసి సందర్శించారు. పాఠశాలలో వసతులను పరిశీలించారు. మెను అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఏవైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.