మహబూబాబాద్ రూరల్, జనవరి 7: అనారోగ్యంతో తమ్ముడు మృతి చెందగా, తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందిన ఘటన మహబూబాబాద్ మండలంలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని పర్వతగిరి గ్రామానికి చెందిన ఎండీ ఇబ్రహీం(72) అనారోగ్యంతో శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు.
తమ్ముడు మృతదేహాన్ని చూసి షేక్ మోదిన్ బీ(76) బోరున విలపించి గుండెనొప్పితో ఒక్కసారిగా కింద పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా వైద్యశాలకు తరలించారు. రాత్రి మోదిన్ బీ మృతి చెందింది. ఒకే రోజు అక్క, తమ్ముడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.