కాళేశ్వరం, జనవరి 2 : అన్నారం(సరస్వతి) బరాజ్ మరమ్మతు కోసం తాత్కాలిక రోడ్డు పనులను అధికారులు ప్రారంభించారు. బరాజ్లో రెండు నెలల కింద బ్లాక్-4లో 38వ గేట్, బ్లాక్-3లో 28వ గేట్ వద్ద నీటి బుంగల గుంతలు ఎలా పడ్డాయి? ఎక్కడినుంచి నీరు వస్తుందో తెలుసుకునేందుకు ప్రత్యేకమైన మట్టి, కంకరతో రోడ్డు వేస్తున్నారు.
గత నెల 29న మంత్రుల బృందం బరాజ్ను పరిశీలించి, మరమ్మతు చేయాలని ఆదేశించింది. ఈమేరకు ఆఫ్కాన్ సంస్థ పనులు చేపట్టగా రెండు రోజుల్లో రోడ్డు పూర్తవుతుందని, ఆ తర్వాత పరీక్షలు ప్రారంభిస్తామని ఇంజినీర్లు తెలిపారు.