కరీమాబాద్, మార్చి 11: తమ కాలనీకి తాగునీరు అందించాలని 42వ డివిజన్లోని బీరన్నకాలనీవాసులు సోమవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం వేసిన మిషన్ భగీరథ పైపులైన్ తమ కాలనీకి సమీపంలో ఉన్నా అధికారులు తాగునీరందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవ చూపి తమ కాలనీలో పైపులైన్లు వేసి తాగునీరందించాలని కోరారు.