చిట్యాల, జూన్ 25 : ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాధకర ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్లో గురువారం జరిగింది.
గ్రామస్తు ల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన కంచు మౌనికబీరన్న దంపతుల కుమార్తె అన్వి (2) తోటి పిల్లలతో ఆడుకుంటూ ప కింటిలో ఉన్న నీటి తొట్టిలో ప్రమాదవశాత్తు పడింది. కొంతసేపటి తర్వా త గుర్తించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చిన్నారి ని బయటకు తీయగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.