ఎన్నికలొచ్చినయి ప్రజలు ఆగం కావొద్దు.. పని చేసింది ఎవలు.. మోసం చేసింది ఎవలని ఆలోచించి ఓటెయ్యాలె.. రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంలో మూడోసారి బీఆర్ఎస్దే విజయమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అధ్యక్షతనమంగళవారం నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే శంకర్నాయక్, మంత్రి పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దాదాపు 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెడితే.., ఈ ప్రాంతానికి వారు చేసిందేమీ లేదన్నారు. మళ్లీ ఒక్కచాన్స్ అంటూ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థతి దారుణంగా ఉందని, ఇప్పటి వరకు పట్టుమని పదిమంది పేర్లు కూడా ప్రకటించలేని దుస్థితిలో ఆ పార్టీ ఉన్నదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పేదలకు సన్నబియ్యం, దశలవారీగా పింఛన్లను రూ.5016కు పెంచుతామన్నారు. 93లక్షల మందికి రూ.5లక్షల బీమా, పేదలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని మంత్రి వివరించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న బీఆర్ఎస్ అభ్యర్థికే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
మహబూబాబాద్, అక్టోబర్ 17: దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పటిష్టంగా ఉందని, రానున్న ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మహబూబాబాద్ ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో విశిష్ట అతిథిగా మంత్రి, నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే శంకర్నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దాదాపుగా 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెడితే.., ఈ ప్రాంతానికి వారు చేసిందేమీ లేదన్నారు. మళ్లీ ఒక్కచాన్స్ అంటూ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పట్టుమని పదిమంది పేర్లు ప్రకటించలేని దుస్థితి బీజేపీదని, అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితి కాంగ్రెస్దని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారే 105 మంది అభ్యర్థులను ప్రకటించి దేశంలో చరిత్ర సృష్టించిందన్నారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా 105 స్థానాలను ఏక కాలంలో ఏ పార్టీ ప్రకటించలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లను రూ.2016 నుంచి దశలవారీగా రూ.5016 కు పెంచుతామన్నారు.
రైతు బీమా మాదిరిగానే రాష్ట్రం లో సాధారణ ప్రజలకు కేసీఆర్ బీమాను అమలు చేస్తామని, దాదాపు 93 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.4016 పింఛన్ను ప్రకటించిన కాంగ్రెస్ వారు పాలించే రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. నెరవేర్చలేని హామీలతో ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని, ప్రజలు గమనించాలని కోరారు. కర్ణాటక నుంచి డబ్బులు తెచ్చి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చూస్తుందని మండిపడ్డారు. 2014, 2018 పరిస్థితే 2013లోనూ కాంగ్రెస్కు ఎదురవుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో 24 లక్షల మందికి రూ.200 చొప్పు న పింఛన్ ఇచ్చేవారని, నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తెలంగాణలోనే 45లక్షల మందికి ఆసరా పింఛన్లు రూ.2016 అందిస్తున్నదన్నారు. ప్రతి నిరుపేద సంతోషంగా ఉండాలనే సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం ఇస్తామన్నారు. బీజేపీ గ్యాస్ ధరలను పెంచితే, బీఆర్ఎస్ తగ్గిస్తున్నదని, అధికారంలోకి రాగానే రూ.400కే గ్యాస్ సిలిండర్, సౌభాగ్యలక్ష్మీ పథకం ద్వారా అర్హలైన మహిళలకు నెలకు రూ.3016 అందిస్తామన్నారు. కేసీఆర్కు ప్రజలు అండగా నిలిచి మరోమారు సీఎంను చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ కవిత మాట్లాడుతూ..
ప్రజల మనోభావాలకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. ఇకపై ఎన్నికలకు సంబంధించిన ప్రతి కార్యక్రమం జిల్లా కార్యాలయం నుంచే నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్నాయక్ను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త పని చేయాలని కోరారు. ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ దీవెనలతో మూడోసారి బీఆర్ఎస్ బీఫాం పొందినట్లు తెలిపారు. ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. కష్టపడి పనిచేసిన వారికి రానున్న రోజుల్లో తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, మార్నేని వెంకన్న, రఘు, మండల అధ్యక్షుడు తేళ్ల శ్రీనివాస్, మహబూబాబాద్ యూత్ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్రెడ్డి, నెల్లికుదురు జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్రెడ్డి, పరిపాటి వెంకట్రెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధ వి, జడ్పీటీసీ లూనావత్ ప్రియాంక, పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, ప్రధాన కార్యదర్శి గోగుల రాజు, పర్కాల శ్రీనివాస్రెడ్డి, మర్రి రంగారావు, మాదారపు సత్యనారాయణ, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మహబూబ్పాషా, బాలాజీనాయక్, ఊకంటి యాకూబ్రెడ్డి, ఆత్మ చైర్మన్ నెహ్రూరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రంజిత్, గుండా రాజశేఖర్ పాల్గొన్నారు.