ఖిలావరంగల్, జనవరి 23: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని కలెక్టర్ బీ గోపి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 71 మంది ఇచ్చిన దరఖాస్తులను ఆయన స్వీకరించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరులో అధికారులు జవాబుదారీ తనం తో ఉండాలన్నారు. గ్రీవెన్స్ సెల్కు వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ఒక వేళ పరిష్కారానికి వీలుగాని సమస్యలను గుర్తించి దానికి గల కారణాలను దరఖాస్తుదారులకు వివరించే ప్రయత్నం చేయాల న్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్వనీ తానాజీ, శ్రీవత్స కోట, అధికారులు పాల్గొన్నారు.
స్థాపనకు రూ.లక్ష విరాళం..
ఖిలావరంగల్, జనవరి 23 : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయనున్న గ్రంథాలయాలకు జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం బాధ్యులు రూ.లక్ష విరాళం కలెక్టర్ గోపికి అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీవత్స కోట, డీఆర్డీవో సంపత్రావు, డీఏవో ఉషాదయాళ్, డీఎంవో ప్రసాదరావు, సీపీవో జీవరత్నం తదిరులు పాల్గొన్నారు.