నర్సంపేట/నర్సంపేటరూరల్/గీసుగొండ, మే 19: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని డీసీవో బీ సంజీవరెడ్డి అన్నారు. నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. జిల్లాలో నల్లబెల్లి సొసైటీ ఆధ్వర్యంలో పెట్రోల్ పంపు ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ వచ్చిందన్నారు. వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, నర్సంపేటలోనూ సొసైటీల ఆధ్వర్యంలో పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సొసైటీల ఆస్తుల రక్షణకు ప్రహరీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సొసైటీల్లో వ్యాపార అవకాశాలు ఉండేలా పెట్రోల్ బంకులు, జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నర్సంపేటలోని సూపర్బజార్ను పునఃప్రారంభిస్తామన్నారు.
ఈ సందర్భంగా ఆయన సూపర్బజార్ స్థలాన్ని పరిశీలించారు. నూతన భవనాన్ని నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ప్రసాదరావు, సొసైటీ అధ్యక్షుడు మూరాల మోహన్రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, ఆర్బీఎస్ కోఆర్డినేటర్ మోతె జైపాల్రెడ్డి, నల్లా మనోహర్రెడ్డి ఉన్నారు. అలాగే, గురిజాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ మోతె కళావతి, సొసైటీ చైర్మన్ ఆకుల రమేశ్ ప్రారంభించారు. లింగాపురం, చిన్నగురిజాల ఎంపీటీసీలు పసునూటి రమేశ్, గడ్డం సుజాత, సీఈవో కోటి, వీఆర్వో లింగయ్య, వైస్చైర్మన్ మేరుగు యాకయ్య, డైరెక్టర్లు గడ్డం నర్సింగం, యశోద సారంగపాణి, ఎడ్ల రవీందర్, పర్ష నర్సింహస్వామి, బొల్లం మోహన్రావు, నామాల సోమయ్య, కత్తుల వెంకటేశ్వర్లు, సారంగం, సంపత్ పాల్గొన్నారు.
గీసుగొండ మండలం ఊకల్ సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ పోలీసు ధర్మారావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బేతినేని వీరరావు., సొపైటీ చైర్మన్ వీరస్వామి, వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, డైరెక్టర్లు రమేశ్, రజిత, వెంకట్రావు, రాజ్కుమార్, నాయకులు డోలి చిన్ని, ముంత రాజయ్య, ఎండిగె వెంకటేశ్వర్లు, మోహన్ పాల్గొన్నారు.