పరకాల, నవంబర్ 11 : తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్న కాంగ్రెస్, తెలంగాణ ప్రజలపై విషం చిమ్ముతున్న బీజేపీని నమ్మి ప్రజలు గోసపడొద్దని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని మల్లక్కపేట, లక్ష్మీపురం, వెంకటాపురం గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా మారిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేదలు సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్రం దేశానికే అన్నపెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. సీఎం కేసీఆర్ అండతో పల్లెల రూపురేఖలు మార్చినట్లు తెలిపారు. గ్రామాల్లో వాడవాడలా సీసీ రోడ్లు, లింకు రోడ్లు, రైతు వేదికలు, జీపీ కా ర్యాలయాలు, మహిళా భవనాలు, కమ్యూనిటీ హాళ్లను ని ర్మించిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. మతం, కులం పేరుతో బీజేపీ నాయకులు రాష్ట్రంలోని ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వా రెంటీ లేని కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో, ఓటు బ్యాం కు లేని బీజేపీ బీసీ సీఎం పేరుతో ప్రజల ముందుకు వస్తున్నదని, రేవూరి ప్రకాశ్రెడ్డి, కాళీప్రసాద్రావు ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విపక్ష అభ్యర్థులకు ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని, మరోసారి కేసీఆర్ సీఎం అయితేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, మండలాధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ బొజ్జం రమేశ్, నాయకులు నేతాని శ్రీనివాస్రెడ్డి, గురిజపల్లి ప్రకాశ్రావు, ఆముదాలపల్లి అశోక్, జడ్పీటీసీ మొగిలి పాల్గొన్నారు.
మండలంలోని లక్ష్మీపురం గ్రామ దళితులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి మద్దతు తెలిపారు. రానున్న ఎన్నికల్లో దళిత కాలనీకి చెందిన తామంతా ఓటు వేసి గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం గౌడ సంఘం నాయకులు ఎమెల్యేను కలిసి మద్దతు తెలిపారు.
నడికూడ : కాంగ్రెస్ పార్టీని నమ్మే రోజులు పోయాయని ఎమ్మెల్యే చల్లా అన్నారు. శనివారం రాత్రి మండలంలోని వరికోల్, పులిగిల్ల, రాయపర్తి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మి దేళ్లలోనే చేసిందన్నారు. ఢిల్లీ గులాము ల పార్టీలను తెలంగాణ నుంచి తరిమేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో కలిసి వరికోల్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. పులిగిళ్ల పద్మశాలి సంఘం నాయకులు బీఆర్ఎస్కు మద్దతు ప్రక టించారు. సర్పంచ్లు సాధు నిర్మల-సమ్మిరెడ్డి, పాలకుర్తి సదానందం, రా వుల సరిత-రాజిరెడ్డి, ఎంపీపీ మచ్చ అనసూయ-రవీందర్, జడ్పీటీసీ కోడెపాక సుమలత-కరుణాకర్, వైస్ ఎంపీ పీ చందా కుమారస్వామి, మండలాధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి, నందికొండ జయపాల్రెడ్డి, తిప్పర్తి సాంబశివారెడ్డి, భీముడి నాగిరెడ్డి, పర్నెం తిరుపతి, బొల్లె భిక్షపతి, గో ల్కొండ సదానందం, యూత్ మండ లాధ్యక్షుడు బొల్లారం అనిల్, కార్యదర్శి సురాబు శ్రీకాంత్, ఏఎంసీ డైరెక్టర్ పోచంపల్లి రఘుపతి, తిప్పర్తి ప్ర శాంత్రెడ్డి, దోమ పవన్ పాల్గొన్నారు.