వరంగల్, డిసెంబర్ 16: గ్రేటర్ కార్పొరేషన్లో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం ఆమె అధికారులతో సమీక్షించారు. వరంగల్ మహానగరం పరిధిలోని 66 డివిజన్లలో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పైపులైన్ లీకేజీలను అరికట్టేందుకు బల్దియా, పబ్లిక్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
వివిధ పథకాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. టెండర్ పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. సిటిజన్ చార్టర్ను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ఆస్తి పేరు మార్పిడి దస్ర్తాలు పెండింగ్లో ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేలా డిప్యూటీ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. గృహాసరాలు, వాణిజ్య భవనాల గుర్తింపు సర్వేను త్వరగా పూర్తి చేయాలన్నారు. నగరంలో పారిశుధ్య పనులను సమర్ధంగా నిర్వహించాలన్నారు. కోతులు, పందుల బెడద సమస్య పరిష్కారానికి దశలవారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సమీక్షలో డిప్యూటీ కమిషనర్లు అనిసుర్ రషీద్, జోనా, శ్రీనివాస్రెడ్డి, సీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, సీహెచ్వో శ్రీనివాసరావు, ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, ఈఈలు శ్రీనివాసరావు, సంజయ్కుమార్, శ్రీనివాసరావు, డీఎఫ్వో శంకర్లింగం, బయాలాజిస్ట్ మాధవరెడ్డి, డీఈలు రవికుమార్, నరేందర్, సారంగం, సంతోష్బాబు, రవికిరణ్ పాల్గొన్నారు.