మడికొండ, అక్టోబర్ 14: మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేసినట్లు పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్లో శనివారం ఆయన మై నార్టీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి మైనార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం వినయ్భాసర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని చెప్పారు.
మైనార్టీల కోసం షాదీ ముబారక్, కుట్టుమిషన్ల పంపిణీ, మైనార్టీ రుణాలు, మైనార్టీ సూల్స్, ఓవర్సీస్ సాలర్షిప్స్, బక్రీద్, రంజాన్ సమయంలో కానుకలు, ఇఫ్తార్ విందు, ఇమామ్లకు రూ.5వేలు వంటి పథకాలు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదే అన్నారు. మత విద్వేషాలకు, మత రాజకీయాలకు తెలంగాణలో చోటు లేదన్నారు. ఎన్నికల సమయంలో మైనార్టీల దగ్గరకు వచ్చే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మైనార్టీల సంక్షేమానికి, భద్రతకు, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం మైనార్టీలకు రూ.లక్ష రుణం పూర్తి సబ్సిడీతో అందింస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లే 50 మంది విద్యార్థులకు ఇప్పటికే ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించామని తెలిపారు. విద్య, వైద్యం, ఉద్యోగాల విషయంలో మైనార్టీలకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. మైనార్టీ మహిళల కోసం 300 కుట్టుమిషన్లను అందించామని, స్వచ్ఛం ద సంస్థల సహకారంతో మరో 50 మందికి పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు అమీద్, అఫ్జల్, ముసాక్, సోని, సర్వర్, మహమూద్, జానీ పాల్గొన్నారు.