హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం లో సీఎం రేవంత్రెడ్డి వల్లే యూరి యా బ్లాక్ మార్కెట్కు తరలుతున్నదని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏప్రి ల్ నుంచి జూలై మధ్యలో యూరియా బ్లాక్మార్కెట్పై 28 షోకాజ్ నోటీసు లు, 9 లైసెన్స్ క్యాన్సిలేషన్లు, 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. దీనిపై విచారణ జరిపితే.. ఆ దందా వెనుక అంతా కాంగ్రెస్ నేతలే ఉన్నారని చెప్పారు.
రేవంత్రెడ్డి చేతగానితనంతోనే యూరియా కొరత ఉత్పన్నమవుతున్నదని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కాంట్రాక్టులన్నింటినీ సీఎం రేవంత్రెడ్డి తమ బంధువులకు ఇచ్చుకొంటున్నారని ఆరోపించారు. ‘జెన్జీ’పై రేవంత్ మొసలికన్నీరు కారుస్తున్నారని, 62 ఏండ్ల వయసున్న వాళ్లను క్యాబినెట్లో పెట్టుకొని జెన్జీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని సెటైర్లు వేశారు.