హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ‘వికసిత్ భారత్-2047’ సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి ఆర్థిక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది, దేశ జీడీపీలో రాష్ట్ర వాటాను ప్రస్తుతమున్న 5 శాతం నుంచి 10 శాతానికి పెంచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం తలసరి ఆదాయం రూ.4 లక్షలకుపైగా ఉన్నదని, ఇది జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపని పేరొన్న ఆయన..మౌలిక వసతుల కల్పనలో కేవలం ప్రభుత్వ రుణాలపైనే ఆధారపడకుండా పీపీపీ ,గ్రీన్ బాండ్లు, బ్లెండెడ్ ఫైనాన్స్ ద్వారా ప్రైవేట్, సంస్థాగత పెట్టుబడులను పెద్దఎత్తున సమీకరిస్తామని భట్టి వెల్లడించారు.