టెక్బాల్లో భారత ప్లేయర్ క్విన్సీ డిసౌజా ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 24 ఏండ్ల క్విమ్సీ 12-7, 9-12, 7-12తో ఇండోనేషియాకు చెందిన సుమయా చేతిలో ఓటమి పాలైంది. తొలి గేమ్ నెగ్గినా అదే జోరు కొనసాగించలేకపోయింది. దాంతో ఆదివారం జరిగే కాంస్య పోరులో పతక అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.