హైదరాబాద్, జూలై 28(నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణ పై ఊహాగానాలు సాగుతున్న వేళ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనలాం టి యువ ఎమ్మెల్యేలకు మంత్రివర్గం లో స్థానం కల్పించాలని ఆయన ఆకాంక్షించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటిన నేపథ్యంలో, జరుగబోయే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ లేదా విస్తరణలో యువ నాయకులకు ప్రాతినిధ్యం ద కాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువతకు మంత్రి పదవులిస్తే పాలనలో మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.