నయీంనగర్, అక్టోబర్ 11 : వరంగల్ చారిత్రక నగరమని, ఇది అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ ఫ్యూచరిస్టిక్ హబ్గా నిలిచిందని తెలంగాణ క్రెడాయి ఎలక్ట్ అధ్యక్షు డు ప్రేమ్సాగర్రెడ్డి అన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో హంటర్రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్లో ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం హనుమకొండ కేయూ రోడ్డులోని కందకట్ల కాంప్లెక్స్లోని క్రెడాయ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఈ రెండో ఎడిషన్ క్రెడాయ్ వరంగల్ ప్రాపర్టీషో-2022 వద్ద బిల్డర్లు తమ ప్రాజెక్టులను అత్యుత్తమంగా ప్రదర్శించుకునే మ హోన్నతమైన అవకాశం కల్పిస్తుందనే న మ్మకంతో ఉన్నామని ప్రేమ్సాగర్రెడ్డి తెలిపారు. వరంగల్ నగరం యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీగా గుర్తిం పు పొందిందని గుర్తు చేశారు. అత్యంత వేగవంతమైన అభివృద్ధి, సంస్కరణల కోసం ఎంపికైన 13 స్మార్ట్నగరాల్లో వరంగల్ ఒకటని ఆయన వెల్లడించారు. ఇందు లో భాగంగానే 40 కిలో మీటర్ల స్మార్ట్ రోడ్ల నిర్మాణం, పర్యావరణ అనుకూల నివాసప్రాంతాలను తీర్చిదిద్దే కార్యక్రమాలు, గ్రీన్ అర్బనైజేషన్స్, చెరువుల సుందరీకరణ, స్మార్ట్ సెంట్రల్ డిస్ట్రిక్ట్, విస్తరించిన వ్యాపార అభివృద్ధి వంటివి చేస్తోందన్నారు. అనంతరం వీటికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.
98స్టాల్స్తో విభిన్న విభాగాలు ఏర్పాటు..
ఈనెల15, 16 తేదీల్లో నిర్వహించే ప్రా పర్టీ షోలో 98స్టాల్స్ను విభిన్న విభాగాల్లో ఏర్పాటు చేయనున్నారు. డెవలపర్లు, ప్రొడ క్ట్ వెండర్లు వరంగల్లో అత్యుత్తమ ప్రాపర్టీలను ఒకే చోట ప్రదర్శించనున్నారు. ప్రతి రోజూ 15 వేల మందికిపైగా సందర్శకుల కోసం ఏర్పాట్లు చేశారు. ఇందులో పాల్గొనే వారికి ఎలాంటి రుసుము లేకుండానే ఎంట్రీ ఉంటుంది.
ఈ సమావేశంలో క్రెడాయ్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ జగన్మోహన్, జాయింట్ సెక్రటరీ శరత్బాబు, జనరల్ సెక్రటరీ మనోహర్, ట్రేజరర్ అమరలింగేశ్వర్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవీందర్రెడ్డి, యూత్వింగ్ కన్వీనర్ వరుణ్ అగర్వాల్తోపాటు ఎగ్జిక్యూటీవ్ సభ్యులు, డెవలపర్లు తది తరులు పాల్గొన్నారు.