గోవిందరావుపేట, జనవరి 29 : పర్యాటక ఖిల్లా ములుగు అని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి బీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మండలంలోని లక్నవరం సరస్సు వద్ద రూ.6 కోట్లతో నిర్మించిన కాటేజీలు, వేలాడే వంతెనను మంత్రులు దయాకర్రావు, సత్యతిరాథోడ్, టీఎస్టీడీసీ చైర్మన్ శ్రీనివాస్గుప్తా, ములుగు జడ్పీచైర్మన్ జగదీశ్వర్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం బోలో వెళ్లి రెండో ఐలాండ్లో నూతనంగా నిర్మించిన కాటేజీలను ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ 20 ఏళ్ల నాటితో పోల్చితే లక్నవరం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కాటేజీలు, నీళ్లపై తేలాడే వంతెనలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. లక్నవరంలో ఉన్న అందాలను తాము ఎప్పుడూ చూడలేదని గోవా అందాలను మైమరపిస్తూ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టూరిజం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. ఆయన సహకారంతోనే ఈ రోజు ములుగు జిల్లా ప ర్యాటక రంగంలో దూసుకెళ్తోందని తెలిపారు. లక్నవరంలో మరో పెద్ద బోటుతో పాటు స్పీడ్ బోట్ల ఏర్పాటు ప్రత్యేక చొరవ తీసుకోనున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. ఎండీ మనోహర్, అధికారుల సేవలు అభిందనీయమని కొనియాడారు. బొగత, మల్లూరు, రామప్పలో పర్యాటక రంగం గా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రులు తెలిపారు. సమావేశంలో టీఎస్టీడీసీ ఎండీ బోయినపల్లి మనోహర్, ఎంపీపీ సూడి శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ తుమ్మల హరిబాబు, బుస్సాపురం సర్పంచ్ సింగం శ్రీలత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సూరపనేని సాయిబాబు, నర్సింహనాయక్, గోవింద్నాయక్ ఉన్నారు.