వరంగల్, నవంబర్ 25 : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రంగంపేటలో నిర్మించనున్న భరోసా కేంద్రం భవనానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని, ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. భరోసా కేంద్రానికి వచ్చే మహిళలకు పోలీసులు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. నగర పోలీ సు కమిషనర్ డైనమిక్ ఆఫీసర్ అని కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు అమలు చేసే దిశగా పని చే స్తున్నారని కితాబు ఇచ్చారు. వరంగల్ భరోసా కేంద్రం దేశంలోనే అత్యుత్తమ సేవలు అందించేలా పనిచేయాలని చెప్పారు. జనగామ జిల్లా కేంద్రంలో భరోసా కేం ద్రం ప్రారంభించాలని జెమిని సంస్థను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. వరంగల్లో ఏర్పాటు చేస్తున్న భరోసా కేంద్రం మార్పునకు నాంది పలకాలని పేర్కొన్నారు. లైంగికదాడులు చేసే వారిపై కఠినంగా వ్యహరించాలన్నారు. పోలీసులు నేరాలను కట్టడి చేయడంలో చాకచక్యంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడానికి కృషి చేస్తున్నదని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వంలోనే పోలీసు వ్యవస్థకు ప్రాధాన్యం లభిస్తున్నదని అ న్నారు. పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని, ప్రజల భద్రత కోసం పోలీసులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గత ప్రభుత్వాలు హోంగార్డులకు కనీస వేతనాలు చెల్లించలేదని, తెలంగాణ ప్రభు త్వం వేతనాలను రూ.20 వేలకు పెంచిందని గుర్తు చేశారు. చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడు తూ సీఎం కేసీఆర్ ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభు త్వం మహిళల సంక్షేమంతోపాటు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో షీ టీమ్లను ఏర్పాటు చేసి మ హిళలకు భద్రత కల్పిస్తున్నామని వివరించారు. మహిళల సమస్యలు పరిష్కరించేందుకు ఫ్రెండ్లీ కేంద్రాలు, మహిళా పోలీస్ స్టేషన్లు, భరోసా కేంద్రాలు పని చేయాలని వెల్లడించారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ కొనసాగుతోందని చెప్పారు. నేరాలు అరికట్టడంలో పోలీసులు చేస్తున్న కృషి అద్భుతం అన్నారు. నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే రోల్ మోడల్ వివరించారు. మహిళలు తమ సమస్యలు చెప్పుకోవడానికి భరోసా కేంద్రాలు ఎంతో తోడ్పాడుతాయని పేర్కొన్నారు. మహిళల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, నగర పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఆశోక్, జెమిని సంస్థ ప్రతినిధులు చంద్రశేఖర్రెడ్డి, అనురాగ్శర్మ తదితరులు పాల్గొన్నారు.