వర్ధన్నపేట, నవంబర్ 7 : ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తున్న టీఆర్ఎస్నే ప్రజలు ఆశీర్వదించి విజయాన్ని అందిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. సోమవారం మండలంలోని ఇల్లంద, దమ్మన్నపేట గ్రామాలతో పాటు పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన 73 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వర్ధన్నపేటలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందించారు. దీంతో వారు ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారని వివరించారు. అందుకే ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ను ఆదరిస్తున్నారన్నారు. విపక్ష నాయకులు ఎన్ని అర్థంలేని విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా గులాబీ పార్టీకి అండగా నిలుస్తూ ఆశీర్వదిస్తున్నారన్నారు. మునుగోడు ఉప ఎన్నికే దీనికి నిదర్శనమని చెప్పారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజల ఆదరణ మరువలేనిదన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
మత్స్యకారుల కుటుంబాలకు చేయూత..
మండలంలోని దమ్మన్నపేట పెద్దచెరువులో 100శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తున్న చేపపిల్లలను కలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే అరూరి చెరువులో లక్షా76వేల చేప పిల్లలను వదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు చేయూతనివ్వడం కోసం ప్రభుత్వం ఉచితంగా చేపవిత్తనాలను పంపిణీ చేస్తున్నదన్నారు. మత్స్యకారుల కుటుంబాలూ ఆర్థిక ప్రగతి సాధిస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, వైస్ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్ఖన్నా, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్రెడ్డి, తహసీల్దార్ చవిచంద్రారెడ్డి, ఆత్మ చైర్మన్ గోపాల్రావు, రైతుబంధు సమితి కన్వీనర్ మోహన్రావు, ఇల్లంద, దమ్మన్నపేట సర్పంచ్లు సాంబయ్య, మంగ, ఎంపీటీసీ గొడిశాల శ్రీనివాస్, కౌన్సిలర్లు తోటకూరి రాజమణి, తుమ్మల రవీందర్, మంచాల రామకృష్ణ, పాలకుర్తి సుజాత, పూజారి సుజాత, టీఆర్ఎస్ నాయకులు తూళ్ల కుమారస్వామి, తుమ్మల యాకయ్య, సిలువేరు కుమారస్వామి, పులి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.