వర్ధన్నపేట/నర్సంపేట/దుగ్గొండి/గీసుగొండ/సంగెం/చెన్నారావుపేట, అక్టోబర్ 22: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లాలోని పోలీస్స్టేషన్లలో ఓపెన్హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులకు పోలీసుల విధులు, ఆయుధాల పనితీరుపై అవగాహన కల్పించారు. వర్ధన్నపేట పోలీస్స్టేషన్లో ఏసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసమే పోలీసు వ్యవస్థ పని చేస్తున్నదని అన్నారు. ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా నిత్యం పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ఎక్కడైనా విపత్తులు, ప్రమాదాలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే తగిన సాయం చేస్తారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు పోలీసులకు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ సదన్కుమార్, ఎస్సై రామారావు పాల్గొన్నారు.
అలాగే, నర్సంపేట పోలీస్స్టేషన్లో ఓపెన్హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ పులి రమేశ్గౌడ్ విద్యార్థులకు ఆయుధాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్పై వివరించారు. కార్యక్రమంలో ఎస్సైలు రవీందర్, సురేశ్, లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. దుగ్గొండి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పోలీస్స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్సై వంగల నవీన్కుమమార్ ఆధ్వర్యంలో ఓపెన్హౌస్ నిర్వహించారు. విద్యార్థులకు ఆయుధాల పనితీరును ఎస్సై వివరించారు. గీసుగొండ పోలీస్ష్టేషన్లో నిర్వహించిన ఓపెన్హౌస్లో మండలకేంద్రంలోని ప్రభు త్వ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకన్న పిల్లలకు పోలీసుల విధులు, స్టేషన్లో ఫిర్యాదుల స్వీకరణ, రికార్డుల నిర్వహణ, ఆయుధాల వినియోగంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఆన్లైన్ మోసాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై దేవేందర్రెడ్డి, కానిస్టేబుళ్లు వెంకన్న, పవన్, కిషన్, దామోదర్ పాల్గొన్నారు. సంగెం పోలీస్స్టేషన్లో ఎస్సై పెండ్యాల దేవేందర్ పోలీసుల విధులు, బాధ్యతలపై విద్యార్థులకు వివరించారు. చెన్నారావుపేట పోలీస్స్టేషన్లో ఎస్సై తోట మహేందర్ స్టేషన్ పనితీరు, ఆయుధాల వినియోగం తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు.
రక్తదానంతో ప్రాణాలు కాపాడొచ్చు
కరీమాబాద్/ఖిలావరంగల్/గిర్మాజీపేట: రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడొచ్చని 4వ బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మామునూరులోని బెటాలియన్లో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం సామాజిక బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ కమాండెంట్ నరేందర్రెడ్డి, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో ఓపెన్హౌస్ నిర్వహించారు. విద్యార్థులకు శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసుల విధి నిర్వహణ, రికార్డులు, నేరస్తుల లాకప్లు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాస్, ఎస్సైలు వినయ్బాబు, శ్రీలత, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఓపెన్హౌస్లో భాగంగా ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్లో సీఐ డీ మల్లేశ్ పోలీసుల విధి నిర్వహణ, చట్టాలు, ఆయుధాలు, వైర్లెస్తో మాట్లాడే విధానంపై కృష్ణాకాలనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. దేశ భవిష్యత్ భావిభారత పౌరులపై ఉందని, ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడువాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.