ఖిలావరంగల్, అక్టోబర్ 11 : లింగ సమానత్వంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ బీ గోపి అన్నా రు. మంగళవారం కలెక్టరేట్లో అంతర్జాతీయ పిల్లలు, బాలికలు, వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ.. 2011 జనా భా లెక్కల ప్రకారం 1000 మంది బాలురకు 940 మంది బాలికలు ఉన్నారన్నారు. ఆడ, మగ పిల్లలు సమానంగా ఉండాలన్నారు. మన సంస్కృతీసంప్రదాయాలకు అనుకూలంగా లింగ సమానత్వం ఉండాలని ప్రభుత్వం తరఫున అవగాహన కల్పిస్తున్నామన్నారు. స్కానింగ్ కేంద్రాల్లో తనిఖీలు చేసి భ్రూణ హత్యలను నివారిస్తామన్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి మహేందర్ మాట్లాడుతూ.. కలెక్టర్గా బీ గోపి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి 84 చైల్డ్ ప్రొటెక్షన్ కేసులు పరిష్కరించి రూ.40లక్షలు పరిహారం ఇచామన్నారు. అదనపు కలెక్టర్ బీ హరిసింగ్, డీఎంహెచ్వో వెంకటరణమణ, అధికారులు పాల్గొన్నారు.
స్ట్రాంగ్రూమ్ ఏర్పాట్ల పరిశీలన..
గిర్మాజీపేట : టీఎస్పీఎస్సీ ఈ నెల 16న నిర్వహించే గ్రూప్-1పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బీ గోపీ అధికారులను ఆదేశించారు. డీఈవో కార్యాలయంలోని స్ట్రాంగ్రూమ్ ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం ఈ పరీక్షపై అప్రమత్తంగా ఉండాలన్నారు. స్ట్రాంగ్రూమ్ ఏర్పాట్లపై డీఈవో వాసంతికి సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట, హనుమకొండ డీసీఈబీ సెక్రటరీ రాజన్న, అసిస్టెంట్ సెక్రటరీ ప్రసన్న, సీనియర్ అసిస్టెంట్, జిల్లా విద్యాశాఖ ఫోరం అధ్యక్షుడు శేషభట్ట శ్రీనివాస్ పాల్గొన్నారు.