నర్సంపేట/నర్సంపేటరూరల్/వర్ధన్నపేట, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నర్సంపేటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శింగిరికొండ మాధవశంకర్గుప్తా, వంగేటి గోవర్ధన్, శ్రీరాంఈశ్వరయ్య, మాదారపు చంద్రశేఖర్గుప్తా, దొడ్డ రవీందర్గుప్తా, చకిలం కృష్ణమూర్తిగుప్తా, తదితరులు పాల్గొన్నారు. అలాగే, సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో అధ్యక్షుడు నల్లా మనోహర్రెడ్డి, ఎంవీరామారావు, లక్ష్మణ్, గోకా నాగేందర్, మల్లయ్య, పూర్ణచందర్రావు, సుధాకర్గౌడ్ పాల్గొన్నారు. నర్సంపేట ఎంపీడీవో కార్యాలయం, ఇటుకాలపల్లి జీపీలో ఎంపీడీవో అంబటి సునీల్కుమార్రాజ్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే, మండలవ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. సర్పంచ్లు కొడారి రవన్న, పెండ్యాల జ్యోతి, ఎం చంద్రమౌళి, జీ రాంబాబు, బీ లావణ్య, జీ మమత, ఎం రవీందర్, దస్రూ, రంగారెడ్డి, శ్రీనివాస్, ఎస్ లావణ్య, పీ పూలమ్మ, గడ్డం స్వాతి, టీ కోమల, బీ లలిత, ఎంపీటీసీలు పాల్గొన్నారు. వర్ధన్నపేటతోపాటు మండలంలోని ఉప్పరపల్లి, ఇల్లందలో ప్రజాప్రతినిధులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉప్పరపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, సర్పంచ్ స్రవంతి పాల్గొన్నారు. అనంతరం కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరైన వారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
మహాత్ముడి ఆశయ సాధనకు కృషి చేద్దాం
ఖానాపురం/దుగ్గొండి/సంగెం/రాయపర్తి/నెక్కొండ/గీసుగొండ/పర్వతగిరి/నల్లబెల్లి: మహాత్మాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు పిలుపునిచ్చారు. ఖానాపురం మండలం కొత్తూరులో సర్పంచ్ బూస రమతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళలర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, బూస అశోక్, ఉపసర్పంచ్ సామేల్, సదర్లాల్, బాలు, వెంకటేశ్వర్లు, సొసైటీ డైరెక్టర్ లక్ష్మణ్, రాంప్రసాద్, కారోబార్ యాకయ్య, పోశెట్టి, నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. దుగ్గొండిలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య గాంధీజీకి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సై నవీన్కుమార్, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్గౌడ్, ఏవో దయాకర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సంగెంలో గాంధీ విగ్రహానికి సర్పంచ్ గుండేటి బాబు ఆధ్వర్యంలో ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీటీ రాజేశ్వర్రావు, ఎంపీటీసీ ఎం మల్లయ్య, ఉపసర్పంచ్ కక్కెర్ల శరత్, కోడూరి సదయ్య, పులి వీరస్వామి, మోహన్, మల్లికార్జున్, కార్యదర్శి రవీందర్ పాల్గొన్నారు. రాయపర్తిలోని టీఆర్ఎస్ కార్యాలయంలో గాంధీ జయంతి నిర్వహించారు.
ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ సారథ్యంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల్లో గాంధీ జయంతి నిర్వహించారు. కార్యక్రమాల్లో పూస మధు, గారె నర్సయ్య, అయిత రాంచందర్, కుందూరు రాంచంద్రారెడ్డి, నయీం, గబ్బెట బాబు, ఎం సుధాకర్, ఏ శ్రీనివాస్రెడ్డి, చెవ్వ కాశీనాథం, చిక్కొండ వీరస్వామి, చందు రామ్యాదవ్, ఎంపీడీవో కిషన్నాయక్, ఎంపీవో రామ్మోహన్, ఏపీవో కుమార్గౌడ్, గిర్దావర్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. నెక్కొండలో ఆర్యవైశ్యం సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నంగునూరి నారాయణ జ్ఞాపకార్థం గాంధీ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేందుకు ఆయన కుమారులు భాస్కర్రావు, వెంకన్న, జగదీశ్, కృష్ణమూర్తి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
కార్యక్రమంలో నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు గోరంటల వీరయ్య, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు దొడ్డ విజయ్, మండల అధ్యక్షుడు దేసు లక్ష్మణ్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంధీజీకి నివాళులర్పించారు. నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, ఉప సర్పంచ్ వీరభద్రయ్య, సీనియర్ నాయకులు శివకుమార్, వీరయ్య, రామాలయ కమిటీ చైర్మన్ సత్యం, నాయకులు పాల్గొన్నారు. గీసుగొండ మండలంలోని గ్రామాలతోపాటు వరంగల్ 15, 16వ డివిజన్లో గాంధీజీ జయంతి నిర్వహించారు. గీసుగొండ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సౌజన్య, ధర్మారంలో కార్పొరేటర్ సుంకరి మనీషా గాంధీ చిత్రపటాలకు పూలమాల వేశారు. సర్పంచ్లు జైపాల్రెడ్డి, మల్లారెడ్డి, ప్రకాశ్, నాగమణి, రమ, స్రవంతి, నాగేశ్వర్రావు, సరోజన, కవిత, వీ రజిత, ఆర్ రజిత, దౌడు బాబు పాల్గొన్నారు. పర్వతగిరిలో గాంధీజీ విగ్రహం వద్ద సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమార్గౌడ్, ఎంపీటీసీ రాజు, ఉపసర్పంచ్ రంగు జనార్దన్గౌడ్ నివాళులర్పించారు. నల్లబెల్లి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీత, ఎంపీడీవో విజయ్కుమార్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, మోహన్రెడ్డి, కోటిలింగాచారి, రాంబాబు, ఎంపీవో కూచన ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.