కాశీబుగ్గ/కరీమాబాద్/గిర్మాజీపేట, సెప్టెంబర్ 27: తెలంగాణపై బీజేపీ చిన్నచూపు చూస్తున్నదని టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. పరిశ్రమలు ఇవ్వలేమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించడంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా మంగళవారం నిరసనలు వెల్లువెత్తాయి. కాశీబుగ్గ చౌరస్తాలో కిషన్రెడ్డి తలలేని దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, ఓని స్వర్ణలతా భాస్కర్, ఎంపీ ఫుర్కాన్, బీ సురేశ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీజేపీ మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రంలో బయ్యారం ఉక్కు, నిజాం షుగర్ పరిశ్రమలను ఇస్తానని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి పరిశ్రమలు ఇవ్వలేమని చెప్పడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ నుంచి వెళ్తున్న ఆదాయాన్ని ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్షా తమ ప్రాంతాలకు పెట్టుబడి పెడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బయ్యాస్వామి, నాయకులు ఈటల ఉమేందర్, ఎండీ ఇక్బాల్, గణిపాక సుధాకర్, రామ రమేశ్, వేముల నాగరాజు, వంగరి శేఖర్, దుబ్బ శ్రీనివాస్, పరికిపండ్ల వంశీ, బాల మోహన్ పాల్గొన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదన్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తాయి.
అండర్రైల్వేగేట్ ప్రాంతంలోని సాకరాశికుంట వద్ద 32వ డివిజన్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పొగాకు సందీప్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను కార్పొరేటర్ పల్లం పద్మ దహనం చేశారు. టీఆర్ఎస్ 40వ డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్ ఆధ్వర్యంలో చెట్లవారిగడ్డ వద్ద కిషన్రెడ్డి ఫ్లెక్సీని కార్పొరేటర్ మరుపల్ల రవి దహనం చేశారు. అలాగే, రంగశాయిపేటలో ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్ ఆధ్వర్యంలో కిషన్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. 33వ డివిజన్లో టీఆర్ఎస్ నేత ముష్కమల్ల సుధాకర్ ఆధ్వర్యంలో కిషన్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. డివిజన్ అధ్యక్షుడు మీరుపెల్లి వినయ్, ప్రధాన కార్యదర్శి గడ్డం రాజు పాల్గొన్నారు.
వెల్లువెత్తిన నిరసనలు..
పోచమ్మమైదాన్/పర్వతగిరి/వర్ధన్నపేట: బయ్యారం ఉక్కు పరిశ్రమ తెలంగాణకు రాదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రకటించడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోచమ్మమైదాన్ సెంటర్ వద్ద రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో నాయకులు మావురపు విజయభాస్కర్రెడ్డి, బస్వరాజు శ్రీమాన్, కర్ణకంటి కుమార్, అహ్మద్, కంచర్ల శివ, జూపాక సురేశ్, ఈర రాజేశ్, వేల్పుల సునీల్యాదవ్, దేవర రాము, కర్రె రవి పాల్గొన్నారు. పర్వతగిరిలో కిషన్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్గౌడ్, చింతపట్ల సోమేశ్వర్రావు, మాజీ జడ్పీటీసీ పంతులు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్రావు, సర్పంచ్లు సీహెచ్ మాలతీరావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేటలోని అంబేద్కర్ సెంటర్లో టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లులోని పలు అంశాలను సైతం పక్కన పెట్టేలా కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పరావు, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, కౌన్సిలర్లు తోటకూరి రాజమణి, తుమ్మల రవీందర్, మంచాల రామకృష్ణ, పూజారి సుజాత, పద్మ, దేవేందర్, రఘు, కుమారస్వామి, చోలేటి ప్రవీణ్రెడ్డి, మరుపట్ల సురేశ్, అన్వర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.