కరీమాబాద్, సెప్టెంబర్ 27: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అండర్ రైల్వేగేట్ ప్రాంతం 32వ డివిజన్ ఎస్ఆర్ఆర్తోటలోని నాగదేవత సహిత కనకదుర్గ మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు మంగళవారం బాలా త్రిపురసుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన పూజారి పాలకుర్తి ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో ఈ అలంకరణ చేశారు.
గిర్మాజీపేట: రామన్నపేటలోని వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవాలయంలో మంగళవారం చండీహోమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు బ్రహ్మదేవర ఆనందరావు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యదర్శి గన్ను రవికాంత్, కోశాధికారి తోట సోమేశ్వర్, ఉపాధ్యక్షులు పబ్బా సాంబమూర్తి, యాదా కృష్ణమూర్తి, సహాయ కార్యదర్శి పిన్నా ఈశ్వర్, టీ రాజేశ్వరరావు పాల్గొన్నారు. స్టేషన్రోడ్డులోని కాశీవిశ్వేశ్వర ఆలయంలో అమ్మవారిని మంగళవారం బాలాత్రిపురసుందరిగా అర్చకుడు లంకా శివకుమార్శర్మ అలంకరించారు. ఎల్లమ్మబజార్లోని మిత్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహానికి కమిటీ అధ్యక్షుడు తత్తరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. దండు దయాసాగర్, నెల్లుట్ల ఎల్లయ్య పాల్గొన్నారు.
నర్సంపేట: నర్సంపేట పదో వార్డులో అమ్మవారు మంగళవారం బాలా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. పూజల్లో కౌన్సిలర్ నాగిశెట్టి పద్మప్రసాద్, విగ్రహదాత ఎదురబోయిన రామస్వామి పూజలు చేశారు.
నల్లబెల్లి: మండలంలోని నారక్కపేటలో అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి కొడూరి రాయాసబ్ లలిత దంపతుల, వనపర్తి రాజు- భాగ్యలక్ష్మి దంపతులు, కమిటీ సభ్యులు పూజలు చేశారు.
నెక్కొండ: మండల కేంద్రంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం బాలాత్రిపుర సుందరి అలంకరణలో ఉన్న అమ్మవారికి పూజలు చేశారు. నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ పొడిశెట్టి సత్యం, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, ఉప సర్పంచ్ దేవనబోయిన వీరభద్రయ్య, ఆలయ కమిటీ సభ్యులు ఈదునూరి రమేశ్, రాపాక లచ్చులు, టీఆర్ఎస్ నాయకులు మల్రెడ్డి కోటిరెడ్డి, రావుల నర్సింహారెడ్డి, రావుల భాస్కర్రెడ్డి, పొలిశెట్టి కిషన్, వనం యాకాంతం, డోలి రవిలో పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పొడిశెట్టి సత్యం, రామలింగేశ్వర సేవాసమితి బాధ్యుడు డింగిరి శేష పవన్కుమార్, భవానీమాతా మాలధారులు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: వరంగల్ ములుగు రోడ్డులోని వాసవీమాత ఆలయంలో అమ్మవారు శ్రీలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.తొలుత వాసవీ అమ్మవారి పంచలోహ ప్రతిమకు వడ్నాల రాధిక నాగరాజుతోపాటు భక్తులు అభిషేకం చేశారు. కుంకుమార్చన, శ్రీలక్ష్మి హోమం, అన్నప్రసాదం అందించారు. ఆలయ చైర్మన్ తాటికొండ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అంచూరి శ్రీనివాస్, కోశాధికారి అనుములపల్లి కృష్ణమూర్తి, బిక్షపతి, కాసం హరిత-నవీన్కుమార్ దంపతులు పాల్గొన్నారు.