న్యూశాయంపేట, సెప్టెంబర్19: రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను మెచ్చే ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకు లు టీఆర్ఎస్లోకి చేరుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగ ల్ 2వ డివిజన్ వంగపహాడ్ గ్రామం నుంచి వివిధ పార్టీలకు చెందిన ముదిరాజ్, మైనార్టీ సంఘాల నుంచి 100 మంది నాయకులు సోమవారం హంటర్ రోడ్డులోని క్యాంపు కార్యలయంలో ఎ మ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. ఈ సందర్భంగా అరూరి రమేశ్ మాట్లా డుతూ ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా, రాష్ట్ర అభివృ ద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశపెడు తున్నారని అన్నారు. టీఆర్ఎస్తోనే అన్ని వర్గా లకు సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మండలంలో టీఆర్ఎస్ బలోపేతానికి పార్టీ నా యకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను కార్యకర్తలు, నాయకులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు, కార్య కర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. సోమవా రం 43వ డివిజన్ తిమ్మాపూర్ ఎస్సీకాలనీలో రూ. 30 లక్షలతో పలు అభి వృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మా ట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి పనులను చేపడుతూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. నియోజకవర్గంలో రూ. కోట్లతో అనేక అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృ ద్ధిలో అగ్రగామిగా నిలుపుతానన్నారు. ప్రతి కాలనీలో మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రభు త్వం ప్రత్యేక చొరవ చూపుతోందని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో చేయని విధంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కార్పొ రేటర్ అరుణ, మేకల రాణి, అకినెపెల్లి స్పందన్ తదితరులు పాల్గొన్నారు.