పాలకుర్తి రూరల్/దేవరుప్పుల, సెప్టెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ నెల 16న మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న సభ ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న వజ్రోత్సవాలకు సుమారు 25వేల మంది తరలివస్తారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాలకుర్తిలోని గుడివాడ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభమై రాజీవ్ చౌరస్తా మీదుగా సభా ప్రాంగణానికి చేరుకుంటుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. అందరికీ భోజన వసతి కల్పిస్తామన్నారు. 17న హైదరాబాద్లో నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు నియోజకవర్గం నుంచి గిరిజన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాలన్నారు. ఇందుకోసం బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సభ నిర్వహణ ఉండాలన్నారు. అనంతరం సభ ఏర్పాట్లపై అధికారులకు స్వయంగా పలు సూచనలు ఇచ్చారు.
ఏర్పాట్లలో నిర్లక్ష్యం చేస్తే ఊరుకోం..
ఈ నెల 16న పాలకుర్తిలో జరిగే సభకు విస్తృత ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశాలను గుర్తించాలని పోలీసులకు సూచించారు. వజ్రోత్సవ ఏర్పాట్లలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతి భోజన కౌంటర్ వద్ద ఎంపీడీవో, తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శులతో కమిటీ వేయాలన్నారు. కళాకారుల ఆట పాటలు అదిరి పోవాలన్నారు. పాలకుర్తి పట్టణాన్ని సుందరంగా అలకరించేందుకు, వజ్రోత్సవాల విజయవంతానికి కమిటీలను నియమించామన్నారు. ఈ కార్యక్రమలో డీపీవో రంగాచారి, ఆర్అండ్బీ డీఈ జీవన్ కుమార్, ఆర్డ్డీవో కే కృష్ణవేణి, ఏడీ కొండల్రెడ్డి, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి రవీందర్, ఐబీ డీఈ శ్రీకాంత్ శర్మ, ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్రావు, ఎంపీడీవో వనపర్తి అశోక్కుమార్, తహసీల్దార్ భూక్యా పాల్సింగ్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావు, మండల అధ్యక్షుడు నవీన్కుమార్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మధార్, పాలకుర్తి సర్పంచ్ యాకాంతారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, ఎర్రబెల్లి రాఘవరావు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు బాలూనాయక్, శ్రీనివాస్, సుధాకర్, చంద్రబాబు, పాపారావు, మహేందర్, వేణు, అశోక్రెడ్డి, సర్వర్ఖాన్ పాల్గొన్నారు.
ప్రతి దళిత కుటుంబానికి ‘దళితబంధు’
పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి ‘దళితబంధు’ అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దేవరుప్పులలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే డిసెంబర్లోపు 1500 దళితబంధు యూనిట్లు మంజూరవుతాయన్నారు. జనాభా ప్రకారం గ్రామాలకు యూనిట్లు కేటాయిస్తామన్నారు. దళిత కుటుంబాలు తామే స్వయంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తీగల దయాకర్, నాయకులు పల్లా సుందరాంరెడ్డి, బస్వ మల్లేశ్, ధరావత్ రాంసింగ్, జోగు సోమనర్సయ్య, భిక్షపతి, కుతాటి నర్సింహులు, మహేశ్, సాయిలు, మైదం జోగేశ్వర్, యాదగిరి, అర్జున్, భరత్, మధు, నర్సింహస్వామి, రమేశ్, యాకయ్య, ఉప్పల్రెడ్డి, ఓడపల్లి రవీందర్, తిరుమలేశ్, రాజన్న, యాదవరెడ్డి పాల్గొన్నారు.