సంగెం, సెప్టెంబర్ 4 : రాష్ట్రంలో నిరుపేదలకు సంక్షే మ పథకాలు అమలు చేయొద్దంటున్న బీజేపికి బుద్ధి చె ప్పాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చా రు. ఆదివారం మండలంలోని చింతలపల్లి, కృష్ణానగర్, కుంటపల్లి, సంగెం, ఎల్గూర్రంగంపేట, కొత్తగూడెం, గాం ధీనగర్, ఎల్గూర్స్టేషన్, నర్సానగర్, తిమ్మాపురం గ్రామా ల్లో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులు పం పిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి పార్టీలకతీతంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందజేస్తుంటే బీజేపీ నాయకులు వాటిని బంద్ చేయాలని కోర్టులకు పోతున్నారని, వారు గ్రామాల్లోకి వస్తే తరిమికొట్టాలన్నారు. కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల వరకు మాఫీ చేసిందని విమర్శించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడుతామన్న మోదీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. దస రా నుంచి ఎవరి స్థలంలో వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. టెక్స్టైల్ పార్కుకు భూములు ఇచ్చిన వారికి వందగజాల స్థలం కేటాయిస్తామని చెప్పారు. కిటెక్స్ కంపెనీలో 9వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. గిరిజన తండాలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నా రు. రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, ఎంపీడీవో మల్లేశం, తహసీల్దార్ రాజేంద్రనాథ్, సర్పంచ్లు ఇండ్ల రవికుమార్, కడారి మోహన్, కావటి వెంకటయ్య, వాసం రజిత, జాటోతు చత్రునాయక్, పోతుల ప్రభాకర్, గన్ను శారద, బాబు, ఎంపీటీసీలు పావని, మల్లయ్య, గుగులోత్ పద్మ, సొసైటీ చైర్మన్లు వేల్పుల కుమారస్వామియాదవ్, దొమ్మాటి సంపత్, వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీ సారంగపాణి, రాజు, గోవర్ధన్గౌడ్, అనిల్, మాజీ సర్పంచ్ శంకర్రావు పాల్గొన్నారు.