గీసుగొండ, ఆగస్టు 26: టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి సాధిస్తున్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఎలుకుర్తికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శుక్రవారం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చల్లా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల వారు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేద కుటుంబానికి అందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. గీసుగొండ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తలకు సూచించారు. టీఆర్ఎస్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా నాయకులు కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో మండల సునీల్, ఏలిశా, మంద నాగరాజు, రమేశ్, సారమ్మ, బుచ్చమ్మ, వరమ్మ, పుష్ప, ప్రశాంత్, మమతతోపాటు మరో 25 మంది ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సర్పంచ్ పూండ్రు జైపాల్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, కార్యదర్శి చల్లా వేణుగోపాల్రెడ్డి, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ మాధవరెడ్డి పాల్గొన్నారు.