నర్సంపేట/పర్వతగిరి/సంగెం, ఆగస్టు 23: రాజాస్థాన్లో ఇంద్ర మేఘ్వాల్ హత్యను నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నర్సంపేటలో చేపట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా దళితరత్న కల్లెపెల్లి ప్రణయదీప్ మాదిగ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థి హత్యపై ప్రధానమంత్రి మోదీ వెంటనే స్పందించాలని కోరారు. దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో కుల ఉన్మాద చర్యలు జరుగకుండా కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేయాలన్నారు. పట్టణంలోని అన్ని విద్యా సంస్థలను మూసి వేయించారు. తరగతులను బాయ్కట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కట్ల రాజశేఖర్, బొట్ల నరేశ్, గుర్రం అజయ్, ధరావత్ సుభాష్, భూక్యా కల్యాణ్, మాలోత్ సంతోష్, గుగ్గిళ్ల రాజశేఖర్, సుధాకర్, స్వామి, సంపత్, ఎర్ర సాయిచంద్ పాల్గొన్నారు. దళిత విద్యార్థి మృతికి నిరసనగా పర్వతగిరిలో విద్యా సంస్థలు బంద్ పాటించాయి. బంద్లో ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జేరిపోతుల వంశీకృష్ణ, స్వేరోస్ ఇంటర్నేషనల్ మండల అధ్యక్షుడు కాసర్ల రాజు, నాయకులు రాజ్కుమార్, ప్రణీత్, వెంకట్, రాజు పాల్గొన్నారు. సంగెంలో దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ చేపట్టారు. కార్యక్రమంలో మెట్టుపెల్లి రమేశ్, కొమురయ్య, శ్రీకర్, పైడి, అఖిల్, భరత్ పాల్గొన్నారు.
‘దాడులు చేస్తే కఠినంగా శిక్షించాలి’
కాశీబుగ్గ: దళితులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించాలని ఎమ్మెస్పీ తూర్పు కో ఆర్డినేటర్ ఈర్ల కుమార్ డిమాండ్ చేశారు. ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ జంక్షన్లో మంగళవారం మానవహారం చేపట్టి అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంలో బాలుడిని టీచర్ కొట్టి చంపడం దారుణమన్నారు. అందుకు నిరసనగా విద్యా సంస్థల బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జన్ను వేణు, సందెల లాజర్, చిన్న, బైరపాక డేవిడ్రాజ్, గంగారపు సాయి, కుమ్మరి రాజు, కోగిల యాకోబు, వంగ పవన్, ఎండీ రహీం, అమీర్, రహీం, గాలి సుదర్శన్, పోలెపాక ప్రణయ్, నాని, పెండ్యాల అరుణ్, కవ్వంపెల్లి రవి, గజ్జి రాజు, మంద రమేశ్, కొండ్రా రాజు, గంగారపు మల్లన్న, కలకోట్ల గిరి, జన్ను మధుకర్ పాల్గొన్నారు.