హసన్పర్తి, ఆగస్టు 23 : భీమారంలోని ఎస్వీఎస్ కళాశాలకు ఐఎస్వో గుర్తింపుతోపాటు ఎస్వీఎస్ బర్క్షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఏటా నిర్వహిస్తున్న ఇండియా ఎడ్యుకేషన్ ఎక్స్లెన్స్ అవార్డు- 2022 ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ను వరించిందని విద్యాసంస్థల చైర్మన్ ఎర్రబెల్లి తిరుమల్రావు మంగళవారం తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..2021-22 విద్యా సంవత్సరంలో ప్లేస్ మెంట్లో టీసీఎస్, విప్రో, క్యాప్ జెమిని, ఇన్ఫోసిస్, ఆక్సెంచర్, కాగ్నిజెంట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు. తమ కళాశాలలో ప్రాంగణ నియామకాలు చేపట్టడానికి మరిన్ని కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఎస్వీఎస్ విద్యాసంస్థకు ఎన్బీఏ గుర్తింపు కోసం రెన్యువల్ చేశామని, 2022-23 సంవత్సరానికి న్యాక్, అటానమస్ స్టేటస్ రాబోతుందన్నారు. ఎంసెట్- 2022 వెళ్లే విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ సెంటర్లను బుధవారం ఉదయం 9 నుంచి 6 గంటల వరకు ఎస్వీఎస్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ సందేహాల నివృత్తి కోసం హెల్ప్లైన్ సెంటర్లో 9849509036, 9866576013, 9866653638 నంబర్లలో సంప్రదించాలన్నారు. కళాశాలలో చేరే విద్యార్థులకు బాయ్స్, గర్ల్స్కు వేర్వేరుగా హాస్టల్ వసతి కల్పించినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తిరుమల్రావు కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, ప్రొఫెసర్ ఏకే రాథోడ్, ప్రిన్సిపాల్ డాక్టర్ బీ రఘు, ప్లేస్ మెంట్ ఆఫీసర్ డాక్టర్ డీ కుమారస్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు.