దుగ్గొండి, జూన్ 22: వచ్చే హరితహారం కార్యక్రమం నాటికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని డీఆర్డీవో సంపత్కుమార్ సూచించారు. గిర్నిబావిలో బుధవారం ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అనంతరం గిర్నిబావి జీపీ కార్యాలయ ఆవరణలో ఉన్న నర్సరీలోని మొక్కలను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా సంపత్రావు మాట్లాడుతూ పారిశుధ్య పనులపై జీపీ సిబ్బంది నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సిబ్బంది వీధులను శుభ్రంగా ఉంచాలన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని, తాగునీటి ట్యాంకర్లలో క్లోరినేషన్ చేయాలని సూచించారు. తర్వాత ఆయన ప్రతి వీధిని కలియదిగిరి గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు తగిన సూచనలు చేసి సలహాలు అందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్గౌడ్, సర్పంచ్లు కూస సమతారాజు, కార్యదర్శి రాజు, జీపీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
లక్ష్యాలను చేరుకోవాలి
నర్సంపేటరూరల్: హరితహారం లక్ష్యాలను ప్రతి ఒక్కరూ చేరుకోవాలని డీఆర్డీవో సంపత్రావు సూచించారు. లక్నేపల్లి, మహేశ్వరంలోని నర్సరీలను డీఆర్డీవో పరిశీలించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయని, నర్సరీల్లోని మొక్కల పంపిణీకి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో ప్రజలకు మొక్కలు అందించాఅలని కోరారు. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో అంబటి సునీల్కుమార్రాజ్, సర్పంచ్లు గొడిశాల రాంబాబు, మాడ్గుల కవిత, కార్యదర్శులు కే అనితారెడ్డి, ఎం కల్పన, ఈసీ సుధాకర్ పాల్గొన్నారు.
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీవో సంపత్రావు సూచించారు. నర్సంపేటలోని ఆదర్శ మండల సమాఖ్య కార్యాలయంలో నర్సంపేట క్లస్టర్ పరిధిలోని నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, దుగ్గొండి మండలాల కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లతో డీఆర్డీవో సమీక్షించారు. మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బ్యాంక్ లింకేజీ టార్గెట్లను చేరుకోవాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాలను ఆడిట్ చేసేందుకు ఎస్హెచ్జీ కమ్యూనిటీ ఆడిటర్లను గుర్తించి వారి పేర్లను ఇవ్వాలని కోరారు. ప్రతి సంఘం సర్వసభ్య సమావేశాన్ని విధిగా నిర్వహించాలని సూచించారు. స్కేలబుల్ ఎంటర్ప్రైజెస్ ప్రకారం ప్రతి గ్రామ సంఘం 8 మంది లబ్ధిదారులను గుర్తించి, వారి ఆదాయ, అభివృద్ధి కార్యక్రమాలు, జీవనోపాధిని పెంపొందించుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సంఘాల సభ్యులు రుణ బకాయిలు లేకుండా చూడాలని కోరారు. మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని కోరారు. సమీక్షలో అడిషనల్ డీఆర్డీవో గొట్టె శ్రీనివాస్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ దయాకర్, బ్యాంక్ లింకేజీ అనిత, సరిత, ఆరు మండలాల ఏపీఎంలు కుందేళ్ల మహేందర్, సునీత, శ్రీనివాస్, ఈశ్వర్, సుధాకర్, రాజ్కుమార్, ప్రేమ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.