నర్సంపేట రూరల్, జూన్ 9: నర్సంపేటను హెల్త్హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన సర్వాపురం శివారులో రూ. 60 కోట్లతో నిర్మిస్తున్న 250 పడకల జిల్లాస్థాయి దవాఖాన, పట్టణంలో తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్తో చర్చించారు. ఇక్కడ దవాఖాన నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. నిరుపేదల ఆరోగ్యానికి కొండంత భరోసా కలుగుతుందన్నారు. పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. రూ. 1.50 కోట్ల నిధులతో మంజూరైన 57 రకాల టెస్ట్లను ఒకేచోట చేసేలా అత్యాధునిక తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ పనులను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా రూ. 4.40 కోట్లతో నర్సంపేట నియోజకవర్గంలో 22 హెల్త్ సబ్ సెంటర్ల పనుల పురోగతిపై పెద్ది ఆరా తీశారు. వీటిలో కొన్ని సబ్ సెంటర్లు నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని చివరి దశకు చేరుకున్నాయని అధికారులు పెద్దికి వివరించారు. ముఖ్యంగా నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం 59 సబ్ సబ్ సెంటర్లకు శాశ్వత భవనాలు మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు.