దుగ్గొండి/బయ్యారం, ఆగస్టు 15 : వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం జాతీయ జెండాకు అవమానం జరిగింది. తహసీల్దార్ ఎం సమ్మక్క త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేశారు. సిబ్బంది తేరుకొని పతాకాన్ని కిందకు దించి సరిచేసి మళ్లీ ఎగురవేయడం చర్చనీయాంశంగా మారింది.
అలాగే మహబూబాబాద్ జిల్లా బయ్యారం జీపీలో కూడా సర్పంచ్ గుగులోత్ శాంతి జెండాను తలకిందులుగా ఎగురవేశారు. గుర్తించిన సిబ్బంది కిందికి దింపు సరిచేశారు.