దుగ్గొండి, జూన్ 9: అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లెప్రగతి అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని జడ్పీ సీఈవో రాజారావు సూచించారు. దుగ్గొండి మండలంలోని పొనకల్, లక్ష్మీపురం, శివాజీనగర్లో గురువారం ఆయన పర్యటించారు. వీధుల్లో తిరిగి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జీపీ సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు. అనంతరం ఆయా గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు, డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలను పరిశీలించి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా గ్రామాల్లో వందశాతం పల్లెప్రగతి పనులు పూర్తి చేసి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్గౌడ్, సర్పంచ్లు బొమ్మగాని ఊర్మిళావెంకన్న, లింగంపల్లి ఉమా రవీందరావు, ఎంపీటీసీ బండి జగన్, మామునూరి సుమన్, ఏఈవో విశ్వశాంతి, కార్యదర్శులు వినోద్కుమార్, కొండల్రెడ్డి, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
‘పల్లెప్రగతి’ని విజయవంతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలను భాగస్వామ్యం చేయాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. మండలంలోని మహేశ్వరం, రాములునాయక్తండాలో గురువారం ఆయన పల్లెప్రగతి పనులను తనిఖీ చేశారు. రాములునాయక్తండాలో శ్మశాన వాటికకు వెళ్లే రహదారిని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న శ్మశాన వాటికను పరిశీలించి సూచనలు చేశారు. యుద్ధప్రాతిపదికన పనులు జరుగాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో అంబటి సునీల్కుమార్రాజ్, ఆర్ఐ రజాక్, సర్పంచ్లు అజ్మీరా మాధవి-శ్రీనివాస్, కవిత, కార్యదర్శులు శ్రావణకుమారి, కల్పన, కారోబార్లు పాల్గొన్నారు. అలాగే, రాములునాయక్తండాలో జరుగుతున్న పనులను ఎంపీడీవో అంబటి సునీల్కుమార్రాజ్, ప్రత్యేక అధికారి ఆర్ఐ రజాక్ సర్పంచ్ అజ్మీరా మాధవితో కలిసి పరిశీలించారు. నాగుర్లపల్లి, మాదన్నపేట, దాసరిపల్లి, భాంజీపేట, కమ్మపల్లిలో సర్పంచ్లు, కార్యదర్శుల ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు కొనసాగాయి. సర్పంచ్లు కందికొండ రజిత, మొలుగూరి చంద్రమౌళి, పెండ్యాల శ్రీనివాస్, పలకల పూలమ్మ, వల్గుబెల్లి రంగారెడ్డి జీపీ సిబ్బందితో పనులు చేయించారు.
అభివృద్ధికి ‘పల్లెప్రగతి’ దోహదం
గీసుగొండ: గ్రామాల అభివృద్ధికి పల్లెప్రగతి పనులు దోహదం చేస్తాయని అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) శ్రీవత్సవ కోట అన్నారు. కోనాయిమాకులలో గురువారం ఆయన మహిళలతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషించాలని సూచించారు. పచ్చదనం, పరిశుభ్రతపై దృష్టి సారించాలని కోరారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాలు తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు పుస్తకాలు అందించాలన్నారు. ఈ సందర్భంగా వంటలను పరిశీలించి రుచిగా ఉన్నాయని కితాబిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ డోలి రాధాబాయి, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో ప్రభాకర్, ఏపీవో మోహన్రావు, సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్, గ్రామ ప్రత్యేక అధికారి కల్యాణి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
పనులను పరిశీలించిన అధికారులు
గ్రామాల్లో ముమ్మరంగా సాగుతున్న పల్లెప్రగతి పనులను గురువారం స్థానిక ప్రజాప్రతనిధులు, సిబ్బందితో కలిసి ప్రత్యేక అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా హరితహారం మొక్కలకు నీళ్లు పో యించారు. వీధులను శుభ్రం చేయించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున రహదారులు, అంతర్గతరోడ్ల వెంట చనిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ నాటించి నీరు అందించారు. ఎంపీడీవో రాజ్యలక్ష్మి చెన్నారం, ఉప్పరపల్లి గ్రామాలను సందర్శించారు. రాయపర్తి మండలంలోని పెర్కవేడు, జగన్నాథపల్లి, స న్నూరు, జయరాంతండా(ఎస్), పన్యానాయక్తండా, వాంకుడోత్తండా సర్పంచ్లు చిన్నాల తారాశ్రీరాజబాబు, గూడెల్లి శ్రీలతా శ్రీనివాస్, నలమాన సారయ్య, బానోత్ పద్మా రవినాయక్, భూక్యా వెంకట్రాంనాయక్, కునుసోత్ సరితా సజ్జన్నాయక్ పనులను పరిశీలించారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించి సిద్ధం చేయించారు. పెర్కవేడులో డ్రైనేజీ నిర్మాణ పనులను సర్పంచ్ చిన్నాల తారాశ్రీ రాజబాబు పరిశీలించారు. కార్యదర్శులు అజ్మీరా వెంకటేశ్నాయక్, లక్ష్మీదేవి, అనిల్కుమార్, చల్లా అజిత్రెడ్డి, భూక్యా మహేందర్నాయక్, అభిలాశ్ పాల్గొన్నారు.
సంగెం మండలంలోని అన్ని గ్రామాల్లో మురుగు కాల్వలు, రోడ్లకు ఇరువైపులా చెత్తాచెదారం తొలగింపు, గ్రామాల్లో పాడుబడిన బావుల పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నల్లబెల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీ వో కూచన ప్రకాశ్ పల్లెప్రగతి కార్యక్రమంపై సమీక్షించారు. హరితహారం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయని తెలిపారు. మండలంలోని 29 జీపీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో అంచనాకు మించి మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. సమావేశంలో ఏపీవో వెంకటనారాయణ, విద్యుత్ ఏఈ విజేందర్, కార్యదర్శులు పాల్గొన్నారు. నల్లబెల్లి మండలం మామిండ్లవీరయ్యపల్లె, రుద్రగూడెంలో పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డు, శ్మశాన వాటికతోపాటు గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను మండల ప్రత్యేక అధికారి జహీరొద్దిన్ పరిశీలించారు. గ్రామాల అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీవో కూచన ప్రకాశ్, సర్పంచ్లు గోనె శ్రీదేవి, మల్లాడి కవిత, ఊరటి అమరేందర్రెడ్డి, కార్యదర్శులు సుధాకర్, పద్మనాభస్వామి, సంతోష్ పాల్గొన్నారు.