గీసుగొండ, జూన్ 5 : చల్లా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్న యువతీయువకులు తప్పక ఉద్యోగం సాధించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని మరియపురం ఎస్ఎస్ గార్డెన్లో శిక్షణ పొందుతున్న 250 మంది విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పరకాల, గీసుగొండ మండలాల్లో ఉచిత శిక్షణ శిబిరాల ద్వారా ఉద్యోగార్థ్థులకు కార్పొరేట్కు దీటుగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి తెప్పించిన 11 రకాల స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందించామన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంతో ప్రతి పేదవాడికీ న్యాయం జరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు పోలీసు ధర్మారావు, సుదర్శన్రెడ్డి, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, మండలాధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, నాయకులు చిన్ని, మల్లారెడ్డి, సంపత్, ఇన్చార్జిలు శ్రీకాంత్, లెనిన్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.