ఫొటో గ్రాఫర్, వరంగల్:రోజురోజుకూ ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండడంతో పక్షులు విలవిల్లాడుతున్నాయి. నీటి కోసం అల్లాడుతున్నాయి. సోమవారం గీసుగొండ మండలం మొగిలిచెర్ల గ్రామ ప్రధాన రహదారి పక్కనున్న చిన్న కుంటలో నీళ్లు కనబడగానే పక్షులు గుంపుగా అక్కడికి చేరి దాహార్తిని తీర్చుకుంటుండగా, ‘నమస్తేతెలంగాణ’ క్లిక్ మనిపించింది.