కాశీబుగ్గ, మే 17: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి ధర రికార్డు పలికింది. మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధర పలికినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పంట దిగుబడి తగ్గినా ధర పెరుగడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూర్ గ్రామానికి చెందిన రైతు యాట ప్రభాకర్ 20 బస్తాల పత్తి మార్కెట్కు తీసుకువచ్చాడు. లక్ష్మీసాయి ట్రేడర్స్ అడ్తి ద్వారా విశ్వనాథ్ ట్రేడింగ్ కంపెనీ ఖరీదు వ్యాపారి అత్యధికంగా క్వింటాల్కు రూ.14వేలకు కొనుగోలు చేశారు. దీంతో ఆ రైతు హర్షం వ్యక్తం చేశాడు. మార్కెట్కు సీజన్లో 5లక్షల 98వేల 500 క్వింటాళ్ల పత్తి వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.