పోచమ్మమైదాన్, మే 16 : జిల్లాలో మత్స్యశాఖ ద్వారా ఉచితంగా పంపిణీ చేసిన చేపల ద్వారా మత్స్యకారులు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. గతేడాది చెరువుల్లో సమృద్ధిగా నీరు ఉండడం, ప్రభుత్వం తగిన తోడ్పాటు అందించడంతో మత్స్యకారులు జీవితాల్లో వెలుగులు నిండాయి. ముఖ్యంగా గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్న సొసైటీల ద్వారా మంచి దిగుబడులు సాధిం చి, ముందంజలో ఉన్నారు. దీనికి తోడు ప్రభుత్వం చేపల కోసం ప్రత్యేకంగా మార్కెట్ సదుపాయం, మత్స్యకారులకు అవసరమైన వాహనాలు, పనిముట్లను అందజేయడంతో 2021-2022 సంవత్సరంలో వార్షికాదా యం పెంచుకోగలిగారు. ఈసారి ప్రకృతి కూడా కరుణించడంతో చెరువుల నిండా చేప లు చేరడం వారికి వరంగా మారింది. జిల్లాలో 9828 టన్నుల చేపలు లభ్యం కావడంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జిల్లాలో 170 మత్స్య సహకార సొసైటీలు ఉండగా, ఇందులో 13,641 మంది సభ్యులు ఉన్నారు. అలాగే పలు గ్రామాల పరిధిలో ఉన్న 402 చెరువుల్లో 32,10,374 బొచ్చలు, 4,70,099 రవ్వులు, 26,54,162 బంగా రు తీగ రకం చేపలను వదిలారు. రాయపర్తి మండలం మైలారం, శాయంపేట మండలం చలివాగు రిజర్వాయర్లో కూడా 16,92,000 బొచ్చలు, రవ్వలు, మెరిగె చేపలను వేశారు. వర్ధన్నపేట మండలం, దమ్మన్నపేట, శాయంపేట మండలం పెద్దకోడెపాక, సంగెం మండ లం ఎల్లూరు రంగంపేట, రాయపర్తి మండలం మైలా రం చెరువులో 13,41,000 రొయ్యలు వదిలారు.
వాహనాల పంపిణీ..
మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం పలు రకాల వాహనాలు, పరికరాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నది. మత్స్యకారులపై ఆర్థికభారం పడకుండా 75శాతం సబ్సిడీ ఇస్తున్నది. 1859 మందికి మోపెడ్లు (ద్విచక్ర వాహనాలు), 183 మందికి లగేజీ ఆటోలను అందజేసింది. అలాగే 117 మందికి వలలు, 42 మందికి ప్లాస్టిక్ ట్రేలు, 11 మందికి ఫిష్ టయాస్కో, 43 మందికి మొబైల్ వాహనాలు, ఇద్దరికి పెద్ద వాహనాలు (డీసీఎం టైప్), ఒకరికి హైజిన్ వెహికిల్ (మినీ డీసీఎం) మరో ఇద్దరికి లాగుడు వలలు పంపిణీ చేశారు.
మహిళా సొసైటీలకు వందశాతం సబ్సిడీ…
వరంగల్ పరిధిలో ఉన్న మహిళా సొసైటీలకు వందశాతం సబ్సిడీ అవకాశం కల్పించారు. ఇందులో 25 సంఘాలకు రూ.91లక్షల వరకు మార్కెటింగ్ సహాయ నిధి కింద అందించారు. నర్సంపేట, నెక్కొండలో ప్రత్యేకంగా ఫిష్ మార్కెటింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. రూ.10లక్షల వ్యయంతో మార్కెట్ల నిర్మాణం చేపట్టారు.
మత్స్యకారులకు అండగా ప్రభుత్వం…
జిల్లాలోని మత్స్యకారులకు అండగా ప్రభుత్వం నిలుస్తున్నది. పారదర్శకంగా మత్స్యకారులందరికీ ఉపాధి అవకాశాలు లభించేలా చేపలు పంపిణీ చేస్తున్నది. గతేడాది 9828 టన్నుల చేపల దిగుబడి సాధించి, అనుకున్న టార్గెట్ చేరుకున్నాం. ప్రభుత్వం ద్వారా అన్ని సొసైటీల సభ్యులకు సబ్సిడీపై పలు రకాల వాహనాలతో పాటు పరికరాలను మంజూరు చేశాం. అందరికీ అందుబాటులో మార్కెటింగ్ సదుపాయం కల్పించాం. మార్కెటింగ్ సహాయ నిధి ద్వారా మహిళా సొసైటీలకు వందశాతం సబ్సిడీ అందించాం.