వరంగల్, మే 16 : కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని బల్దియా గ్రీవెన్స్లో పలువురు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి కమిషనర్ ప్రావీణ్య వినతులు స్వీకరించారు. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్ల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కమిషనర్కు విన్నవించారు. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు లాంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. పలు కాలనీల అభివృద్ధి కమిటీల బాధ్యులు సమస్యలపై కమిషనర్కు వినతిపత్రాలు అందజేశారు. నల్లా కనెక్షన్ లేకున్నా పన్ను వస్తోందని, అనేకసార్లు వినతి పత్రం అందచేసినా పరిష్కారం కావడం లేదని పలువురు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రీవెన్స్లో మొత్తం 75 వినతులు రాగా, అందులో టౌన్ప్లానింగ్ విభాగానికి 41, ఇంజినీరింగ్ విభాగానికి 23, ప్రజారోగ్యం 3, పన్నుల విభాగానికి 7, హార్టికల్చర్ విభాగానికి ఒకటి వచ్చాయి. గ్రీవెన్స్లో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, ఎస్ఈ ప్రవీణ్చంద్ర, సిటీ ప్లానర్ వెంకన్న, డీఎఫ్వో కిశోర్, డిప్యూటీ కమిషనర్ జోనా, హార్టికల్చర్ అధికారి ప్రిసిల్లా, వింగ్ అధికారులు పాల్గొన్నారు