కాశీబుగ్గ, మే16: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని వరంగల్తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం 20వ డివిజన్లోని ప్రభుత్వ నరేంద్రనగర్ (గుడిబడి) ఉన్నత పాఠశాలను మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా సందర్శించి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలకు మౌలిక సదుపాయాలు, స్థల సేకరణ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించే ప్రభుత్వ పాఠశాల అని అలాగే విద్యార్థుల సంఖ్య కూడా అధికంగా ఉన్నట్లు తెలిపారు. పాఠశాలకు డైనింగ్హాల్, కిచెన్ కోసం స్థలం పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, ఎంఈవో విజయ్కుమార్, ప్రదానోపాధ్యాయుడు కుంట్ల రవికుమార్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
హనుమాన్ భక్తులకు అన్నదానం
హనుమాన్ మాల ధరించిన స్వాములకు నగరంలోని కాశీబుగ్గ ప్రాంతంలో రంగనాయకుల ఆలయంలో వరంగల్తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హనుమాన్ అన్నదానం నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యమంలో కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, మాజీ కార్పొరేటర్ బయ్యాస్వామి, స్వాములు పాల్గొన్నారు.
పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యం
నెక్కొండ: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని చేపట్టిందని ఎంపీపీ జాటోత్ రమేశ్ అన్నారు. ఫణికరలో ఆయన మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని ఎంపీపీ ప్రారంభించారు. మండలంలోని రెడ్లవాడ, అలంకానిపేట, అప్పల్రావుపేట, బొల్లికొండ గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో జడ్పీటీసీ లావుడ్య సరోజనా హరికిషన్, ఎంపీడీవో సుగుణకుమార్, ఎంఈవో రత్నమాల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, ఏఈ రాజ్కుమార్, ప్రధానోపాధ్యాయులు రంగారావు, జ్యోతి లక్ష్మి, సైట్ ఇంజినీర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.