కరీమాబాద్, మే 6: తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న నేపథ్యంలో సర్కారు కొలువే లక్ష్యంగా యువత చదవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మామునూరులోని పీటీసీలో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్ను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని సూచించారు. ప్రణాళికాబద్ధంగా చదివి అవకాశాలను చేజిక్కించుకోవాలని కోరారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో అందిస్తున్న ఉచిత కోచింగ్ను వినియోగించుకోవాలని సూచించారు. ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్న వారందరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. యువతీ యువకులకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి అభ్యర్థులతో కలిసి భోజనం చేశారు. అలాగే, కోచింగ్ సెంటర్పై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత యువతీ యువకులకు ఇస్తున్న శిక్షణను పరిశీలించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అరుణ, మామునూరు సీఐ రమేశ్, పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పార్టీకి కార్యకర్తలే వెన్నెముక..
వర్ధన్నపేట: నిబద్ధతతో పని చేసే కార్యకర్తలే టీఆర్ఎస్కు వెన్నెముక అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. వర్ధన్నపేట క్యాంపు కార్యాలయానికి శుక్రవారం ఆయన ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి వినయ్భాస్కర్, అరూరి రమేశ్ను శాలువాతో సత్కరించారు. అనంతరం చీఫ్విప్ మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ ఇంత బలంగా ఉండడానికి కారణం నిబద్ధతతో పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలే అన్నారు.