వరంగల్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనతో గ్రేటర్ వరంగల్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వా త పెద్ద నగరమైన వరంగల్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మంత్రి కేటీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ కార్పొరేషన్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పనులు, ప్రణాళికలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. చిన్న కారణాలతో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసేలా స్పష్టత ఇచ్చారు. కాళోజీ కళాక్షేత్రం పనులను వీలైనంత త్వరగా పూర్తి చే యాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించాలని సూచించారు. నిధుల పరంగా ఇబ్బంది లేనప్పు డు పనులు ఆలస్యం కావొద్దని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ గ్రేటర్లో సుడిగాలి పర్యటన చేశారు. రూ.188 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
కొత్త పనులు…
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్లూఎంసీ) ఆవరణలో 14 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ నగరంలోని మౌలిక వసతుల కల్పన సంపూర్ణంగా ఉం డాలని అన్నారు. నగర అవసరాలకు అనుగుణం గా కొత్త పనులు చేపట్టేందుకు ఎప్పటికప్పుడు ప్ర ణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రూ.8 కోట్లతో 150 కేఎల్డీ సామర్థ్యం కలిగిన మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం నిర్మాణ పనులు మొ దలయ్యాయి. ఇది పూర్తయితే ఎప్పటికప్పుడు మానవ వనరుల వ్యర్థాల నిర్వహణతో నగరం పరిశుభ్రతలో మరింత పురోగతి సాధిస్తుంది. గ్రేట ర్ వరంగల్లో పరిపాలనాపరంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు అత్యాధునిక హంగులతో భవనం అవసరం ఉన్నది. ఈ మేరకు మం త్రి కేటీఆర్ రూ.71 కోట్లతో జీడబ్ల్యూఎంసీ ప్రధా న కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రో ల్ సెంటర్, రూ.22.50 కోట్లతో జీడబ్ల్యూఎంసీ పరిపాలన భవనం, రూ.2 కోట్లతో కౌన్సిల్ హాల్, రూ.4 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
రెండు భవనాలు పూర్తయితే జీడబ్ల్యూఎంసీ పరిపాలన కేం ద్రానికి కొత్త కళ రానుంది. మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన వాటిలో రూ.2 కోట్లతో నిర్మించే ది వ్యాంగుల శిక్షణ కేంద్రం ఉన్నది. గ్రేటర్ వరంగల్లోని దివ్యాంగులను అన్ని రకాలుగా తీర్చిద్దడం కోసం ఇది ఉపయోపడనుంది. గ్రేటర్ వరంగల్ నగరానికి వరదల ముంపు సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లక్ష్యంగా అవసరమైన చోట నిర్మాణా లు చేపడుతున్నారు. నాలాలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా రూ.22 కోట్లతో నయీంనగర్ నుంచి ప్రెసిడెన్షియల్ స్కూ ల్ వరకు రిటైనింగ్ వాల్, రూ.15 కోట్లతో నాలాలపై కల్వర్టు, రూ.2.50 కోట్లతో కాజీపేట నుంచి పెద్దమ్మగడ్డ వరకు ఆర్సీసీ రిటైనింగ్ వాల్ నిర్మిం చే పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వానాకాలంలోపు వీటిని పూర్తి చేసే లక్ష్యంతో పను లు కొనసాగనున్నాయి.
హస్తకళల ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కల్పించడం కోసం రూ.3.10 కోట్లతో హస్తకళ ఔట్లెట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజికల్ గార్డెన్ను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు రూ.70 లక్షలతో 150 అడుగుల ఎత్తు జాతీయ జెండాను ఏర్పాటు చేసే పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆగస్టు 15లోపు ఈ పనులను పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్లోని 37 సర్కారు స్కూళ్లలో రూ.9 కోట్లతో మౌలిక వసతుల కల్పన పనులను మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యేలోపు అన్ని వసతులతో ఈ స్కూళ్లకు కొత్త కళ రానుంది.