అత్యాధునిక వసతులతో నిర్మాణం
క్యాబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్, మే 30 ( నమస్తే తెలంగాణ) : వరంగల్ను మెడికల్ హబ్గా మార్చే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. సెంట్రల్ జైల్ను నగర శివారు మా మునూరులోని సువిశాలమైన స్థలంలో అత్యాధునిక వసతులతో కూడిన సెంట్రల్ జైల్ను నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో వరంగల్లో మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నగర నడిబొడ్డున ఉన్న సెంట్రల్ జైల్ తరలింపుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెంట్రల్ జైల్ తరలింపు, నిర్మాణ ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలను ఇతర జైళ్లకు తరలించే ప్రక్రియను చేపట్టాలన్నారు. నెల రోజుల వ్యవధిలో ఖైదీల తరలింపు, సెంట్రల్ జైల్ స్థలాన్ని వైద్యశాఖకు అప్పగించే ప్రక్రియను పూర్తి చేయాలని హోం శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న సెంట్రల్ జైల్ ప్రాంగణంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. దీనికి సంబందించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి వచ్చే క్యాబి నెట్ సమావేశం ముందుకు తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు.
మామునూరులో సెంట్రల్ జైల్
నగర శివారు మామునూరులో సెంట్రల్ జైల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇటీవల నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సెంట్రల్ జైల్ను సందర్శించిన సమయంలో జిల్లా అధికార యంత్రాంగం ధర్మసాగర్ మండలం ఉనిక చర్ల, మామునూరులో సెంట్రల్ జైల్ నిర్మాణానికి అనువైన స్థలాలు ఉన్నట్లు వివరించారు. వాటికి సం బంధించిన లే అవుట్లను ప్రదర్శించారు. వీటిని పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ మామునూరులో కొత్తగా సెంట్రల్ జైల్ను ఆధునిక సౌకర్యాలతో పాటు ఖైదీల పరివర్తన కేంద్రంగా నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంతివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. వెంటనే సెంట్రల్ జైల్ ఖైదీలను ఇతర జైళ్లకు తరలింపు, కొత్త జైల్ నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రివర్గ సమావేశంలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
సెంట్రల్ జైల్లో మల్టీ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రస్తుత సెంట్రల్జైల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేయను న్నారు. నగర నడిబొడ్డున ఉన్న సెంట్రల్ జైల్ ప్రాంగణం మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కానుంది. తెలంగాణ ప్రభుత్వం వరంగ ల్ను హెల్త్హబ్గా తీర్చిదిద్దాలన్న సంకల్పం త్వరలో సాకారం కానుంది. రాష్ట్రంలోనే రెండవ పెద్ద నగ రమైన వరం గల్ నగరం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఉత్తర తెలంగాణకు వైద్య రంగంలో గుండె కాయగా నిలువనుంది. ఇప్పటికే మెడికల్ యూనివర్సిటీ, కళాశాలకు ఆనుకొని ఉన్న సెంట్రల్ జైల్లో మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేప ట్టాలని మంత్రివర్గం నిర్ణయించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మాతాశిశు సంరక్షణ కేంద్రంగా ఎంజీఎం..
ఉత్తర తెలంగాణకు సేవలు అందిస్తున్న ఎంజీఎంను మాతా శిశు సంరక్షణ కేంద్రంగా మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంజీఎంలో ఏర్పాటు చేయనున్న మాతాశిశు సంరక్షణ కేంద్రం సేవలు అందించేలా తీర్చిదిద్దాలని ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే ఎంజీఎం మాతాశిశు సంరక్షణ కేంద్ర ంగా తీర్చిదిద్దే ప్రక్రియను వైద్యశాఖ చేపట్టనుంది.
మానుకోటలో మెడికల్ కాలేజ్..
మానుకోట జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణ యం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీల్లో ఒకటి మహబూబాబాద్లో ఏర్పాటు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకు న్నారు. గతంలోనే మహబూబాబాద్కు మెడికల్ కళాశాల ప్రకటించిన సీఎం కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. కొత్తగా మహబాబాబాద్కు మంజూరు చేసిన మెడికల్ కాలేజీతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు మెడికల్ కాలేజీలు కానున్నాయి.