చెన్నారావుపేట, మే 26 : కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని గోదాములు, మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ భూక్య హరిసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ధాన్యం మండలంలోని కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ధాన్యంలో తేమ శాతాన్ని, తాలు పడుతున్న విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని గోదాముల్లో ధాన్యం దిగుమతి ప్రక్రియను పరిశీలించారు. హరిసింగ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బార్దాన్, ఎగుమతికి ట్రాన్స్పోర్ట్ సమస్యలున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. వీటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సైప్లె డీఎం భాస్కర్రావు, తహసీల్దార్ పూల్సింగ్చౌహాన్, గిర్ధావర్ స్వామి, వీఆర్వో ఐలయ్య, సీఈవో చిట్టె రవి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు : ఆర్డీవో
ఖానాపురం : ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని నర్సంపేట ఆర్డీవో పవన్కుమార్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని శ్రీనివాస రైస్మిల్లును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైస్మిల్లుకు ప్రతిరోజూ ఎన్ని లారీల్లో ధాన్యం దిగుమతి అవుతుంది, హమాలీల కొరత ఉందా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. పవన్కుమార్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమవుతున్నందున ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు.