నయీంనగర్, ఏప్రిల్ 28 : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బస్సు యాత్రలో భాగంగా ఆదివారం భారీ రోడ్షో నిర్వహించారు. హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద ప్రజాప్రతినిధులు, మంగళ హారతులతో జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతితో పాటు పలువురు మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు.
కేసీఆర్ను చూడడానికి జనాలు వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు. డప్పు వాయిద్యాలు, పాటలతో అంబేద్కర్ జంక్షన్ మార్మోగింది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి సుధీర్ కుమార్ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, కేసీఆర్ను ఫొటో తీసేందుకు జనాలు పోటీలు పడ్డారు. అంబేద్కర్ జంక్షన్ నుంచి 7.57గంటలకు పోలీసు హెడ్క్వార్టర్స్ నుంచి హనుమకొండ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు.